: హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ భార్య ఆత్మహత్య!

హైదరాబాద్ లో అదనపు పోలీస్ కమిషనర్ శివప్రసాద్ భార్య ఉషారాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న ఆయన, బేగంపేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉషారాణి, తమ నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

More Telugu News