: ‘ఛాంపియన్స్ ట్రోఫీ’లో పాక్ బౌలర్ షాదాబ్ మధురానుభూతులు!

భారత్ - పాక్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తన మధురానుభూతులను పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బీబీసీ ఉర్దూ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాదాబ్ మాట్లాడుతూ, ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, సెమీ ఫైనల్లో జో రూట్ వికెట్లను తీసుకున్న సందర్భాలను తాను మర్చిపోలేనని అన్నాడు. యువరాజ్, రూట్ .. వీరిద్దరూ ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లని, ఆయా జట్లలో కీలక ఆటగాళ్లని అన్నాడు. ఈ ట్రోఫీలో అటువంటి కీలక ఆటగాళ్ల వికెట్లను తన ఖాతాలో వేసుకోవడాన్ని మర్చిపోలేనని షాదాబ్ చెప్పాడు.

More Telugu News