: హిందూపురంలో బాలయ్య... మూడు రోజులు అక్కడే మకాం!

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలసి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఆయన హిందూపురంలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడున్నా తన నియోజకవర్గ ప్రజల బాగు కోసం ఆలోచిస్తుంటానని చెప్పారు. హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చేందుకోసం త్వరలోనే హంద్రీనీవా నీటిని తీసుకొస్తానని తెలిపారు. సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజులు నియోజకవర్గానికి దూరమయ్యానని చెప్పారు. 

More Telugu News