: ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్: చైనా క్రీడాకారిణిపై పీవీ సింధు విజయ దుందుభి

సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పోరులో భార‌త క్రీడాకారుల హ‌వా కొన‌సాగుతోంది. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఈ రోజు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మ‌హిళ‌ల సింగిల్స్‌లో హైద‌రాబాదీ పీవీ సింధు విజ‌య దుందుభి మోగించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్ట‌ర్స్ లో చైనా క్రీడాకారిణి చెన్ జియాజిన్‌పై 21-13, 21-18 తేడాతో గెలుపొంది క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది.        

More Telugu News