: నా కుమార్తెను రాత్రి పూట రోడ్డుపైకి పంపే సమస్యే లేదు: కర్ణాటక కాంగ్రెస్ నేత

కర్ణాటకలో మహిళల రక్షణపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దినేష్ గుండూ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని నెలలుగా బెంగళూరులో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని చెబుతూనే, రాత్రి వేళల్లో తన కుమార్తె బయటకు వెళ్లేందుకు అంగీకరించబోనని, ముఖ్యంగా ఎంజీ రోడ్డు ప్రాంతానికి అసలు పంపించబోనని అన్నారు. నూతన సంవత్సరం మహిళలపై వేధింపులు, ఆపై జరిగిన పలు ఘటనలను ఉదహరించిన ఆయన, ఎవరో వచ్చి సాయం చేస్తారని మహిళలు ఎదురుచూడకుండా, తమ వంతు నిరసన గళాన్ని వినిపించాలని అన్నారు.

More Telugu News