: విశాఖలో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులు
మరికాసేపట్లో విశాఖపట్నంలోని జీవీఎంసీ సమీపంలో ప్రారంభమయ్యే 'సేవ్ విశాఖ' మహాధర్నాలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. విశాఖలో వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, దీని వెనకున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, వైకాపా ఈ మహాధర్నాను చేపట్టిన సంగతి తెలిసిందే. ధర్నాలో పాల్గొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. జిల్లా వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, పార్టీ నాయకులు తలశిల రఘురాం తదితరులు జన సమీకరణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ మహాధర్నా వేదికకు చేరుకోనున్నారు.