: కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల కాల్చివేత

దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన పుల్వామాలో ఈ రోజు (గురువారం) ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇటీవల లష్కరే తాయిబాలో చేరిన ముగ్గురు స్థానిక యువకులు జనసమ్మర్థంగా ఉండే ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి బుధవారం భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో బుధవారం సాయంత్రమే భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి.

దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎన్‌కౌంటర్ జరిగింది. రాత్రంతా కొనసాగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇంటిలో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు గురువారం తెల్లవారుజామున హతమయ్యారు. మూడు రోజుల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. బుధవారం బారాముల్లా జిల్లాలోని సోపోర్ టౌన్‌షిప్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

More Telugu News