: గవర్నర్‌ నరసింహన్ కు ఐవైఆర్‌ కృష్ణారావు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్‌ కృష్ణారావు త‌న ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టుల‌పై క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించింది. ఈ నేపథ్యంలో ఆయ‌న ఈ రోజు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోష‌ల్ మీడియాలో తాను షేర్‌ చేసిన పోస్ట్‌లు, తదనంతర పరిణామాలపై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. అలాగే, త‌న‌పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప‌లు అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టులు పెడుతున్నార‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది.       

More Telugu News