: ‘ఛాంపియన్స్’గా నిలిచామని ‘పాక్’లో చేసుకున్న సంబరాల్లో బాలుడు మృతి!

రెండు రోజుల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై పాక్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థానీయులు చేసుకున్న సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సంబరాల్లో సయీద్ క్వాజిమ్ రజా జైదీ కుటుంబం కూడా పాల్గొంది. పాక్ విజయం సాధించడంపై సంతోషం పట్టలేని ఓ వ్యక్తి తుపాకీతో గాల్లోకి పేల్చగా, అక్కడే ఉన్న సయీద్ క్వాజిమ్ పెద్ద కుమారుడు హుస్సేన్(15) కు బుల్లెట్ తగలడంతో ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

More Telugu News