: బ్యూటీషియన్ శిరీష మృతి కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్ కు శిరీష, రాజీవ్, శ్రవణ్ ల ఆడియో టేపులు!

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష డెత్ మిస్టరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమెది ఆత్మహత్యే అనే తేల్చిన పోలీసులు... శిరీషకు సంబంధించిన ఆడియో టేపులపై తాజాగా దృష్టి సారించారు. శిరీష, రాజీవ్, శ్రవణ్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బంజారాహిల్స్ పోలీసులు సేకరించారు. ఈ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా శిరీష ఆడియోను పోలీసులు నిర్ధారించనున్నారు. రాజీవ్ స్నేహితుడు నవీన్ తో కూడా శిరీష ఫోన్ లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారే అవకాశం ఉంది.

More Telugu News