: విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త.. జూలై 1 నుంచి డిపార్చర్ కార్డులకు చెక్!

విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు శుభవార్త. జూలై 1 నుంచి విదేశాలకు వెళ్లే వారు ఇక నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని ఉండదు. అయితే రైలు, సముద్ర  మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును విధిగా నింపాల్సి ఉంటుందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. డిపార్చర్ కార్డులో ప్రయాణికుడి పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నంబరు, భారత్‌లోని చిరునామా, విమాన నంబరు, ప్రయాణిస్తున్న తేదీ తదితర వివరాలను నింపాల్సి ఉండేది. అయితే జూలై 1 నుంచి ఈ విధానాన్ని తొలగిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ విధానాన్ని ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్నారు.

More Telugu News