: ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్.. పంజాబ్‌లో రైతు రుణాల మాఫీ!

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సోమవారం రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.2 లక్షల వరకు చిన్న, సన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఆయన ప్రకటన చేశారు.  2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీ ఇదే. ప్రభుత్వ హామీతో 10.25 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతుల రుణాలను ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలు రద్దు చేయగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రుణాలు రద్దు చేసింది.

More Telugu News