: మా పరిస్థితి మైదానంలో కేవలం ఏడుగురు ఆటగాళ్లతో మాత్రమే ఆడుతున్నట్టుంది!: ఎయిర్ ఫోర్స్ చీఫ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత పరిస్థితిపై ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బీఎస్ ధ‌నోవా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమ పరిస్థితి పదకొండు మందితో ఆడాల్సిన జట్టులో కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఉండి... పదకొండు మంది సభ్యులున్న జట్టుతో తలపడుతున్నట్టు ఉందని అన్నారు. ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్‌ లో యుద్ధ విమానాలు, యుద్ధ పైల‌ట్ల కొర‌త ఉందని చెప్పారు. అవసరమైనంత సిబ్బంది లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాక్ నుంచి ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే గగనతలం నుంచి విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వసన్నద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం గ్రౌండ్ లెవల్ ఫోర్సెస్ కు ఇంటెలిజెన్స్ సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితవుతోందని ఆయన చెప్పారు. మావోయిస్టులపై గగనతలం నుంచి దాడులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ సొంత దేశంలో, సొంత ప్రజలపై దాడులు చేసేందుకు సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News