: ‘పాక్’ స్కోరు 300 పరుగులు దాటింది!

ఛాంపియన్స్ ట్రోఫీలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 300 పరుగులు పూర్తి చేసింది. 46.2 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు స్కోరు..306/4. ప్రస్తుతం క్రీజ్ లో హఫీజ్ (43), ఇమాద్ వసీం (13) కొనసాగుతున్నారు. మరి కొంచెం సేపట్లో నిర్ణీత 50 ఓవర్లు ముగియనున్నాయి. పాక్ జట్టు తన స్కోరును ఇంకా ఏమాత్రం ముందుకు తీసుకువెళుతుందనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News