: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత కిదాంబి శ్రీకాంత్

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ని తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్ తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండు సెట్లలో కిదాంబి తన సత్తా చాటాడు. తొలి సెట్ ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్, రెండో సెట్ ను సొంతం చేసుకునేందుకు కొంచెం శ్రమించాల్సి వచ్చింది. సుకాయ్ పై విజృంభించిన శ్రీకాంత్.. రెండో సెంట్ ను 21-19తో గెలిచి సూపర్ సిరీస్ ను సాధించాడు.




 

More Telugu News