: ఘనంగా మంత్రి ఈటల కుమారుడి వివాహం.. కొత్త దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ వివాహం హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ వివాహానికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులను ఈ సందర్భంగా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News