: సేవల విషయంలో చివరి స్థానంలో ప్రభుత్వరంగ బ్యాంకులు

ప్రభుత్వరంగ బ్యాంకులు పాత కాలం  నాటి ఆలోచనల నుంచి బయటపడడం లేదు. సేవల విలువ వాటికి ఇప్పటికీ తెలిసి రాలేదు. బ్యాంకింగ్స్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఈ జాబితాలో పీఎన్ బీ, ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ చివరన ఉన్నాయి. ఆర్ బీఎల్ బ్యాంకు టాప్ లో ఉంది. మిగిలిన అన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ జాబితాలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉండడం విశేషం. ప్రభుత్వరంగంలో ఒక్క ఐడీబీఐ మాత్రం సేవల విషయంలో కస్టమర్ల ఆదరణ పొందడం విశేషం.

More Telugu News