: తిరుమల కొండపై అపచారం.. వెంకన్న సన్నిధికి మద్యం బాటిళ్లు!

సెక్యూరిటీ లోపాల కారణంగా తిరుమల కొండపై అపచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా లోపాలను ఉపయోగించుకుని కొంతమంది ప్రవిత్రమైన స్థలంలో అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వెంకన్న సన్నిధికి మద్యం, సిగరెట్లు, గుట్కాల సరఫరా యథేచ్చగా సాగుతోంది. తాజాగా భవన నిర్మాణ కూలీల నుంచి ఏకంగా 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల కొండపై ఇలాంటి దారుణాలు జరుగుతుండటం ఏమిటని భక్తులు వాపోతున్నారు. 

More Telugu News