: నాంపల్లి కోర్టుకు శిరీష ఆత్మహత్య కేసు నిందితులు రాజీవ్, శ్రవణ్

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసులో ఏ1గా శ్రవణ్ ను, ఏ2గా రాజీవ్ ను పోలీసులు పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 306, రెడ్ విత్ 109 కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరినీ కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు, శిరీషది ఆత్మహత్య అని పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ... శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డిలవి ఆత్మహత్యలు కాదని, ముమ్మాటికీ హత్యలే అని వారి వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

More Telugu News