: జేసీపై ట్రావెల్ బ్యాన్ విధించిన 9 విమాన యాన సంస్థలు...యూరోప్ వెళ్లిన జేసీ

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై 9 విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని, సిబ్బందితో అభ్యంతరకరంగా వ్యవహరించారని చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ జేసీపై నిషేధం విధించింది. అనంతరం ఈ నిర్ణయానికి మరో నాలుగు విమానయాన సంస్థలు మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. మొత్తం తొమ్మిది విమాన యాన సంస్థలు ఎంపీ జేసీపై నిషేధం విధించాయి. తన వ్యవహారశైలి వివాదంగా మారిన నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ ట్రిప్ కు వెళ్లడం విశేషం. 

More Telugu News