: మరో ఐదు రోజుల్లో ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలిసిపోతుంది!

ఏన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయానికి మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై ఎన్డీయే మిత్రపక్షాలతో ఈ నెల 19న భేటీ కానుంది. కూటమిలోని సభ్యుల అభిప్రాయాల మేరకు ఓ నిర్ణయానికి రానున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి, రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసిన అనంతరం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్, ఎంఎస్ స్వామినాథన్, ‘మెట్రో’ మ్యాన్ శ్రీధరన్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా తాను రేసులో లేనని, అవన్నీ వదంతులేనని శ్రీధరన్ ఇప్పటికే కొట్టిపారేసిన విషయం విదితమే. 

More Telugu News