: బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

హైదరాబాద్, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఆసుప‌త్రిలో ఈ రోజు అల‌జ‌డి చెల‌రేగింది. 21 ఏళ్ల‌ శ్రావ‌ణి అనే నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి  చెందింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు శ్రావణి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. అదే ఆసుప‌త్రిలో శ్రావణి తల్లి కూడా న‌ర్సుగా పనిచేస్తోంది. శ్రావ‌ణి మృతదేహాన్ని బసవతారం ఆసుప‌త్రిలోని మార్చురీకి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News