: నెల్లూరు జిల్లాలో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ రోజు ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో అధికార టీడీపీ వ‌ర్గీయులు, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గీయులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అం‌దుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని లాఠీ ఛార్జి చేశారు. ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. టీడీపై, వైసీపీ వ‌ర్గీయులు ఎందుకు ఘ‌ర్ష‌ణ ప‌డాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.        

More Telugu News