: లండన్ టవర్ ప్రమాదంలో గల్లంతైన ఆ 65 మంది ఎక్కడ...?

లండన్ లో మూడు రోజుల క్రితం ఓ అపార్ట్ మెంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 17గానే ఉండగా... 65 మంది ఆచూకీ మాత్రం ఇంత వరకు చిక్కలేదు. వీరు కూడా ప్రమాదంలో మృతి చెంది ఉంటారని ద సన్ వార్తా పత్రిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100 దాటుతుందా? అన్న ప్రశ్నకు... లండన్ పోలీసు కమిషనర్ స్టువార్ట్ కుండీ చెబుతూ, ఆ స్థాయికి చేరకూడదన్నదే తన ఆశ అని అన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రమాదానికి గురైన భవనానికి ఇటీవలే ఎక్స్ టీరియర్ పునరుద్ధరణ పనులు జరిగాయని, ఆ సమయంలోనే భవనం భద్రత విషయంలో పలు సందేహాలు వ్యక్తమైనట్టు స్థానికుల కథనం.

More Telugu News