: జైలులో నిరాహార దీక్షకు దిగిన నళిని

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని జైలులో నిరాహార దీక్షకు దిగింది. చెన్నైలోని వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, తనను పుళల్ జైలుకు తరలించాలని డిమాండ్ చేస్తోంది. 21 మే 1991లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో రాజీవ్ గాంధీని బెల్టు బాంబుతో హతమార్చిన ఎల్టీటీఈ సూసైడ్ స్క్వాడ్ లో నళిని సభ్యురాలు. ప్రస్తుతం ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళినిని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో విడుదల చేయాలని పలు తమిళ సంఘాలు గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితను కోరిన సంగతి తెలిసిందే. 

More Telugu News