: పెరోల్ పై బయటకు వచ్చి, మసాజ్ చేయించుకుని, బాహుబలి-2 చూసి, జంప్ అయింది!: ఓ సన్యాసిని కథ

జై శ్రీగిరి... చూడ్డానికి ఆమె ఓ సన్యాసిని. ఓ ఆలయాన్ని నిర్వహిస్తూ, ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ఆలయంపై గుజరాత్ పోలీసులు దాడులు నిర్వహించగా కోట్ల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లతో పాటు మద్యం సీసాలు లభించాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా ఉంది. తాజాగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమె పెరోల్ పై బయటకు వచ్చింది. ఆమెకు కాపలాగా నలుగురు పోలీసు గార్డులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాత తనకు కొంచెం రెస్ట్ కావాలంటూ గార్డులను ఆమె బతిమాలుకుంది. ఆ తర్వాత తన వ్యక్తిగత లాయర్, పోలీస్ గార్డులతో కలసి అహ్మదాబాద్ లోని హిమాలయన్ మాల్ కు వెళ్లింది.

అనంతరం అక్కడ తనకు నచ్చిన ఫుడ్ ను ఫుల్ గా లాగించింది. ఆ తర్వాత బాడీ మసాజ్ చేయించుకుంది. తర్వాత 'బాహుబలి-2' సినిమా చూసింది. ఆ తర్వాత తన పెరోల్ ను పొడిగించే అవకాశం ఉందేమో అని ఆరా తీసింది. పెరోల్ కొనసాగింపు కుదరదని తేలడంతో... వాష్ రూమ్ కు వెళ్లొస్తానని చెప్పి, జంప్ అయింది. దీంతో ఆమెను పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలెట్టారు. మరోవైపు, ఆమె న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News