: ప్రమాదానికి గురైన నితీష్ కుమార్ కాన్వాయ్!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. పాట్నా నుంచి కిషన్ గంజ్ కు వస్తున్న తరుణంలో సుపౌల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయరహదారి-57 పై ఓ ట్రక్ ను ఓవర్ టేక్ చేసే సమయంలో, కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి, బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డవారిని హుటాహుటిన దర్భంగ లోని పరాస్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ పోలీసుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. 

More Telugu News