: రైతుల ముసుగులో గుంటూరు రియల్టర్లు: ఎమ్మెల్యే మోదుగుల

గుంటూరు జిల్లాకు చెందిన రియల్టర్లు రైతుల ముసుగులో మోసాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియతో మాట్లాడుతూ, ఈ జిల్లాకు చెందిన రియల్టర్లు లక్షల హెక్టార్ల ఎకరాల్లో లే-అవుట్లు వేసి, రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని, నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందని, ఎరువుల మిక్సింగ్ ప్లాంటులో కల్తీ జరుగుతోందని ఆరోపించారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందంటూ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ఈ సందర్భంగా మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News