: ట‌మిమ్ హాఫ్ సెంచ‌రీ... 100 మార్కును దాటిన బంగ్లాదేశ్ స్కోరు

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నేటి మ్యాచులో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. సౌమ్య స‌ర్కార్ 0, ష‌బ్బిర్ 19 ప‌రుగుల‌కి అవుట్ కాగా అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ర‌హీమ్ 25 ప‌రుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెన‌ర్ ట‌మిమ్ క్రీజులో నిల‌క‌డ‌గా రాణిస్తూ 62 బంతుల్లో 50 ప‌రుగులు చేశాడు. 20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి బంగ్లాదేశ్ జ‌ట్టు 105 ప‌రుగులతో ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.    

More Telugu News