: ప్లేయర్ల కంటే ముందుగానే గ్రౌండ్ లో అడుగుపెట్టిన వర్షం!

ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్ ల మధ్య నేడు జరుగుతున్న సెమీ ఫైనల్స్ లో... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఇంకా ప్లేయర్లు మైదానంలోకి అడుగుపెట్టక ముందే వరుణుడు విచ్చేశాడు. స్టేడియం వద్ద ఓ మోస్తరు జల్లులు కురవడంతో పిచ్ పై కవర్లను ఉంచారు. పది నిమిషాల తర్వాత చినుకులు ఆగిపోయాయి. ప్రస్తుతం పిచ్ పై నుంచి కవర్లను తొలగించారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

More Telugu News