: హోదా కోసం గొడ్డు మాంసం తినే వారిని ఉరేయాలి: సాధ్వి సరస్వతి

గొడ్డు మాంసాన్ని హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరితీయాలని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాధ్వి సరస్వతి డిమాండ్ చేశారు. గోవాలోని రామ్ నాతిలో నాలుగు రోజుల అఖిల భారత హిందూ మహాసభ ప్రారంభం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలు చూస్తుండగానే వారిని ఉరితీయాలి. గోవుల పరిరక్షణ బాధ్యతను అర్థం చేసుకోవాలి’’ అని కోరారు. హిందువులు తమ మహిళలను లవ్ జీహాది బారి నుంచి రక్షించుకునేందుకు తమ ఇళ్లల్లో ఆయుధాలు ఉంచుకోవాలని సూచించారు.

గోమాతను కాపాడతామంటూ అధికారంలోకి వచ్చిన వారు దాన్ని మర్చిపోయి, ఇప్పుడు రెండు విధాలుగా మాట్లాడుతున్నారని సతానత్ సంస్థ అధికార ప్రతినిధి అభయ్ వర్తక్ బీజేపీ సర్కారును తప్పుబట్టారు. ‘‘గోవాలో గొడ్డు మాంసం ఓ ఆహార అలవాటని బీజేపీ చెబుతోంది. మరో రాష్ట్రానికి చెందిన సీఎం తాను గొడ్డు మాంసం తింటానని చెబుతున్నారు. ఒకే జాతి, ఒకే గుర్తు అంటూ బీజేపీ ఒకప్పుడు ప్రచారం చేసేది. నేడు ఒకే పార్టీ రెండు నాల్కలు అన్నట్టుగా మారిపోయింది’’ అని వర్తక్ విమర్శించారు.

More Telugu News