: స్నేహితుడ్ని సేవ్ చేసేందుకు గ్యాంగ్ రేప్ అంటూ కట్టుకథ అల్లిన యువతి!

ఇంటికి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? అని ప్రశ్నించిన తల్లిదండ్రులకు కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూసిన 16 ఏళ్ల యువతి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంది. పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని రోహిణిలోని బేగంపూర్‌ ఏరియాలో ఉంటున్న ఓ 16 ఏళ్ల యువతి ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ పార్క్‌ వద్దకు రాత్రి 9:30 నిమిషాలకు స్నేహితుడితో కలిసి వెళ్లింది. అనంతరం ఇంటికి ఆలస్యంగా రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో వారికి తాను స్నేహితుడ్ని కలిసేందుకు పార్క్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో నలుగురు గుర్తు తెలియని ఆగంతుకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, తన స్నేహితుడు చూస్తుండగా వారు ఈ దారుణానికి ఒడిగట్టారని కట్టుకథ అల్లింది.

అయితే ఆమె అంచనాలు తప్పాయి. ఈ కట్టుకథతో తల్లిదండ్రులు మౌనంగా ఉంటారనుకున్న ఆమె ఆలోచన తల్లికిందులైంది. కుటుంబ సభ్యులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్ సేకరించారు. అనంతరం ఆమె స్నేహితుడిని పిలిచి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె స్నేహితుడే ఆమెపై అత్యాచారం చేశాడని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. నిజం దాచిన ఆమెను మందలించి పంపేశారు.

More Telugu News