: ఘనంగా జరిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం

దివంగత టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడి తనయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి వివాహం ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు, శ్రావ్యల వివాహానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు, సినీ నిర్మాతలు, ప్రముఖ వ్యాపారులు ఇలా వివిధ వర్గాల వారితో పాటు రామ్మోహన్ నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళం, బండారు సత్యనారాయణ మూర్తి నియోజకవర్గాల కార్యకర్తలు వేలాది మంది వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.  

More Telugu News