: నాపై ఎల్లలు లేని ఈ దుష్ప్రచారం ఎందుకు?: మాల్యా సూటి ప్రశ్న

భారత ప్రసార మాధ్యమాలు తనపై ఎల్లలులేని దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా బుధవారం నాడు ఆరోపించారు. బ్యాంకులకు తానేమీ బకాయిలు లేనని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టులో మంగళవారం నాడు వాదనలు వినిపించి బెయిల్ పొందిన ఆయన, ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం యూకే కోర్టులో ఓ కేసు వేసిందని గుర్తు చేస్తూ, తీర్పు వచ్చేంత వరకూ ఆగలేరా? అని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.

ఓవెల్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీ చూసేందుకు వచ్చిన తనను, దొంగని ఎవరూ అనలేదని, ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని, ఎంతో మంది తన వద్దకు వచ్చి, విష్ చేశారని చెప్పారు. తనను దొంగ దొంగ అని అరిచినట్టు భారత మీడియా ఎన్నో వార్తలు రాసిందని, తనపై వస్తున్న అన్ని ఆరోపణలనూ వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

More Telugu News