: భూ వివాదంలో ఇరుక్కున్న డీఎస్.. టీఆర్ఎస్ కు మరో షాక్!

టీఆర్ఎస్ కీలక నేతలు భూ వివాదాల్లో ఇరుక్కుంటుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ కేకే భూ రిజిస్ట్రేషన్ వివాదంలో కూరుకుపోయారు. తాజాగా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై భూ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల కోసం ఇచ్చిన అసైన్డ్ భూమిని అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలో గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో 8.9 ఎకరాల భూమి (సర్వే నంబర్ 221) ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ భూమిని నిరుపేద ముదిరాజ్ లకు కేటాయించారు. 1972-73లో ఈ భూమిని ముదిరాజ్ ల నుంచి బొక్క యాదిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత యాదిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, బల్వంత్ రెడ్డి, రఘుపతి రెడ్డిల నుంచి ఈ భూమిని 2015లో డీఎస్, ఆయన అనుచరుడు ఎ.వి.సత్యనారాయణలు కొనుగోలు చేశారు. ఇందులో డీఎస్ పేరిట 4 ఎకరాలు (డాక్యుమెంట్ నంబర్ 4873/15) ఉంది. ఈ భూమిని 2015లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మ్యుటేషన్ కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వీరు దరఖాస్తు చేసుకున్నారు. భూమిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయావర్గాల్లో చర్చనీయాంశం అయింది.

More Telugu News