: పెళ్లిలో గులాబీ పూల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేశారు.. ఇక పెళ్లి ఎలా జరిగిందంటే..!
ప్రపంచంలోని ధనవంతుడు ఎవరైనా తమ పిల్లల పెళ్లి వేడుకని అత్యంత ఘనంగానే చేయాలని అనుకుంటారు. తమ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక గురించి తరతరాలు చెప్పుకోవాలని, ఆకాశమంత పందిరి వేసి.. అలంకారాల మిలమిలలతో పెళ్లి జరిపిస్తారు. ఫోలరున్షో అలకీజ అనే నైజీరియన్ శ్రీమంతురాలు కూడా తన తనయుడి పెళ్లి అలాగే జరిపించింది. ఆ పెళ్లి వేడుకలో కేవలం గులాబీ పూల కోసమే రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేశారంటే ఇక పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఊహించుకోవచ్చు. ఈ పెళ్లి వేడుక కోసం తమ బ్లెన్ హీమ్ ప్యాలెస్ ను తెల్లగులాబీలతో అలంకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను అలరించడానికి రాబిన్ థికే అనే సింగర్ తో లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇప్పించారు. అతడికి ఇచ్చుకున్న పారితోషకం ఎంతో తెలుసా? దాదాపు కోటీ ఇరవై లక్షల రూపాయలు!
ఇక ఆ పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కట్ చేసిన 12 అడుగుల ఎత్తున్న ఎయిట్ టైర్ కేక్ కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పెళ్లి మొత్తం ఖర్చు దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు అయింది. ఫోలరున్షో అలకీజ కుమారుడు ఫొలరిన్ (30) కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురి పేరు ఫొలరిన్. ఆ యువతి ఫొలరిన్కు స్నేహితురాలు.