: టీడీపీలో నాకు గౌరవం లేదు.. టీడీపీకి భవిష్యత్తూ లేదు: శిల్పా మోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీలో తనకు కనీస గౌరవం కూడా దక్కలేదని కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తాను తీసుకెళ్లినప్పటికీ, ఆయన పట్టించుకోలేదని అన్నారు. తాను టీడీపీని వీడి వైసీపీలో చేరడం వల్ల... దాని ప్రభావం తన సోదరుడు చక్రపాణిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. మూడేళ్లపాటు టీడీపీకి సేవ చేశానని... ఆ పార్టీకి భవిష్యత్తులేదనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. పార్టీ మారడం వెనుక ఎలాంటి ఒప్పందం లేదని అన్నారు.

టీడీపీలోకి భూమా నాగిరెడ్డిని చేర్చుకున్నప్పుడు కూడా తాను సర్దుకుపోయానని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని... టీడీపీ పతనం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేవలం హామీలకే పరిమితం అవుతున్నారని... పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. 

More Telugu News