: సినారె కడచూపు కోసం హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి.నారాయణరెడ్డి పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. దీనికోసం ఆయన ఈ సాయంత్రం ప్రత్యేకంగా హైదరాబాదుకు వస్తున్నారు. వచ్చీరాగానే సినారె నివాసానికి చేరుకుని ఆయనకు నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సినారె భౌతికకాయానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.

More Telugu News