: ఆవులను తరలిస్తున్న వ్యక్తులను చితక్కొట్టారు!

పశువుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ అక్ర‌మంగా గోవుల‌ను త‌ర‌లిస్తూనే ఉన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ రోజు గోవుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న వారిని గో సంరక్షకులు ప‌ట్టుకున్నారు. ఆ ఆవుల‌న్నింటినీ వారు కబేళాల‌కు తరలిస్తున్నార‌ని తెలుసుకున్న గో సంర‌క్ష‌కులు వాటిని తీసుకెళుతున్న వాహ‌నాన్ని ధ్వంసం చేశారు. గోవుల‌ను త‌ర‌లిస్తోన్న వ్యక్తులను చావ‌బాదారు. ఆవులను విడిపించి వాటిని త‌ర‌లించారు.             

More Telugu News