: ఫేస్బుక్లో చేసిన పోస్టు కారణంగా పాకిస్థానీకి మరణశిక్ష!
ఫేస్బుక్లో చేసిన పోస్టు కారణంగా ఓ పాకిస్థాన్ వ్యక్తికి మరణశిక్ష పడింది. పాకిస్థాన్లో దైవ దూషణను నేరంగా పరిగణిస్తారు. అయినప్పటికీ 30 ఏళ్ల తైమూర్ రజా అనే వ్యక్తి ఫేస్బుక్లో దైవదూషణ చేస్తూ పోస్టులు పెట్టాడని పాకిస్థాన్ అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టు కారణంగా ఓ వ్యక్తికి మరణశిక్ష విధించడం ఇదే మొదటి సారి. దోషి రజా.. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్యలు, సహచరులను ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ పోస్టు చేసినట్లు బహవాల్పూర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో దైవదూషణ కేసును ఉగ్రవాద నిరోధక కోర్టు విచారించడం మరో విశేషం. ఆయన విద్వేష ప్రసంగాలు కూడా చేశారని కోర్టు పేర్కొంది.