: ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో, అప్రమత్తమైన అధికారులు కార్యాలయ సిబ్బందిని బయటకు పంపించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఈ ప్రమాదంలో కీలక సమాచారం ఉన్న ఫైళ్లు అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది. ఈసీ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

More Telugu News