: బాకీ తీర్చు .. లేదా కోరిక తీర్చు: కామాంధుడైన వడ్డీ వ్యాపారి వేధింపులు

'బాకీ అయినా తీర్చు.. లేదా కోరిక అయినా తీర్చు' అంటూ వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడైన వడ్డీ వ్యాపారిపై మెదక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని దమ్మక్కపల్లిలో చిల్ల సంతయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి అదే గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్ల క్రితం కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఆ దంపతులు బాకీ తీర్చకపోవడంతో చిల్లయ్య పంచాయతీ పెట్టాడు. పెద్దలు కొంత గడువిచ్చి బాకీ తీర్చాలని సూచించారు. ఈ క్రమంలో సత్తయ్య బాకీ ఇచ్చిన వివాహిత (25) ను అడ్డుకుని బాకీ తీర్చాలని, లేని పక్షంలో బాకీ కింద తన కోరిక తీర్చాలని వేధించాడు. లేని పక్షంలో ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News