: కారులో పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిన యువతి.. ఊపిరాడక చనిపోయిన చిన్నారులు

అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ త‌ల్లి నిర్ల‌క్ష్యానికి ఇద్ద‌రు చిన్నారులు ఊపిరాడ‌క న‌ర‌క‌యాత‌న అనుభ‌వించి ప్రాణాలు కోల్పోయారు. తన ప్రియుడితో క‌లిసి ఓ ఇంట్లోకి వెళ్లిన ఆ త‌ల్లి, త‌న‌ పిల్లల్ని కారులోనే వదిలేయ‌డంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కారులో పిల్ల‌ల‌ను వ‌దిలేసి వెళ్లిన 15 గంటల త‌రువాత కారువ‌ద్ద‌కి వ‌చ్చి చూసిన ఆ 22 ఏళ్ల యువతికి ఆ కారులో త‌న పిల్ల‌లు చ‌నిపోయార‌ని తెలిసింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ త‌ల్లిని అరెస్టు చేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పోలీసులు మాట్లాడుతూ...  అమాండా హకిన్స్ అనే మహిళకు రెండు సంవ‌త్స‌రాల‌ వయసున్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నార‌ని, ప్రియుడితో కలిసి అమాండా పార్క్‌కి వెళ్లింద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఆమె త‌న పిల్ల‌లను కూడా తీసుకెళ్లింద‌ని అన్నారు. అనంత‌రం త‌న ప్రియుడితో క‌లిసి మ‌ద్యం తాగి, ఓ రూమ్‌లోకి వెళ్లింద‌ని చెప్పారు. 15 గంట‌ల త‌రువాత‌ కారులో త‌న పిల్లలను చూసిన‌ అమాండా వారిని క‌నీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని, వారు చ‌నిపోతే త‌నకు శిక్ష ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డింద‌ని చెప్పారు. స్థానికులు త‌మ‌కు స‌మాచారం అందించార‌ని పోలీసులు అన్నారు. 

More Telugu News