: అలనాటి నటుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న బాలీవుడ్‌ నిర్మాతలు

‘పాకీజా’ సినిమాలో నటించి అలరించిన అలనాటి బాలీవుడ్ నటి గీతాకపూర్ ఇప్పుడు దయనీయస్థితిలో వృద్ధాశ్ర‌మంలో చేరిన విష‌యం తెలిసిందే. గీతాకపూర్‌కు ఓ కొడుకు, కూతురు ఉన్న‌ప్ప‌టికీ ఆమె బాగోగుల‌ను వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆమెకే కాదు, మ‌రికొంత మంది అల‌నాటి బాలీవుడ్ న‌టుల‌కి కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో అటువంటి వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ నిర్మాత‌లు అశోక్‌ పండిట్‌, రమేష్‌ తౌరాని స‌హా ప‌లువురు వృద్ధాశ్రమం నెలకొల్ప‌నున్నారు. ఇదే విష‌య‌మై భారతీయ ఫిలిం, టెలివిజన్‌ దర్శకుల సంఘం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌విస్‌కి ఓ విజ్ఞప్తి చేసింది. తాము నెల‌కొల్ప‌నున్న‌ వృద్ధాశ్రమ నిర్మాణానికి అనువైన చోటును కేటాయించాల‌ని కోరింది. గీతాక‌పూర్‌ని ఆమె కొడుకు ఆసుప‌త్రిలో అనాథ‌గా వ‌దిలేసివెళ్లిన‌ప్పుడు నిర్మాత‌ అశోక్‌ పండిట్ ఆమె వైద్య ఖర్చులను భ‌రించారు. అనంత‌రం అంధేరిలోని వృద్ధాశ్రమంకు ఆమెను తరలించారు.       

More Telugu News