: చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబు కలకలం
చెన్నైలోని టీ నగర్లో గల భారతీయ జనతా పార్టీ ఆఫీసు వద్ద అలజడి చెలరేగుతోంది. ఆ కార్యాలయంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్ చేయడంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పోలీసులకి ఓ బ్యాగ్లో బాణసంచా తయారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కవర్ని ఓ దుండగుడు అక్కడ విడిచి వెళ్లినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆఫీసు వద్ద భద్రతను పెంచారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.