: దేవాన్ష్ ఏడ్చినా జగనే గిచ్చి ఉంటారని అంటారు!: ఎమ్మెల్యే రోజా ఎద్దేవా
అసెంబ్లీలోని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి వర్షపు నీళ్లు రావడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ అధినేతపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ నేతల పథకం ప్రకారమే జగన్ ఛాంబర్లో లీకేజీ వ్యవహారం జరిగిందని ఆమె అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జగన్పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో ఏ ఘటన జరిగినా అది జగన్ వల్లే అంటూ టీడీపీ నేతలు అంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ ఏడ్చినప్పటికీ జగనే గిచ్చి ఉంటారని అంటారేమో? అని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఛాంబర్లో లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.