: సంతాప సభలో దాసరి కాంస్య విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు సంతాప సభ ఈ నెల 11న మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో జరగనుంది. ఈ సందర్భంగా దాసరి కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్నిఅనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్  తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంతాప సభలో దాసరి విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం దీనిని తయారు చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరినట్టు చెప్పారు. దీంతో పాటు, ఫిలింనగర్ లో ఏర్పాటు చేసేందుకు తొమ్మిది అడుగుల దాసరి విగ్రహాన్నీ తయారు చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News