: హైదరాబాద్ లో ఐటీ కారిడార్ కు ‘ఉగ్ర’ ముప్పు.. ఐబీ హెచ్చరికలు!

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలతో పాటు, నగరంలోని పలు షాపింగ్ మాల్స్ నూ ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు ఐబీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కారిడార్ లోను, మాల్స్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రంజాన్ మాసంలో ఐబీ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.  

More Telugu News