: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనాపై సీసీఎస్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఆసిఫ్ నగర్ భోజగుట్టలోని వీవర్స్ కాలనీ, అయోధ్యకాలనీకి చెందిన వ్యక్తుల ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు వీరిపై నమోదు చేశారు. ఈ కాలనీలకు చెందిన వ్యక్తుల నుంచే మరో ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. ఈ విషయమై ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, హైదరాబాద్ లోని భోజగుట్ట, బంజారాహిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనా, రియల్టర్ శ్రీనివాస్ లపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేయడం జరిగింది.  

More Telugu News