: రైతుల మృతిపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: వెంకయ్యనాయుడు

మధ్యప్రదేశ్ లో రైతుల మృతిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో రైతులకు పది లక్షల కోట్ల రుణాలిచ్చామని, తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా వచ్చేలా పథకం తీసుకొచ్చామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.50 వేల కోట్లు మంజూరు చేశామని అన్నారు. రైతులపై కాల్పులు జరగడం బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ, కలెక్టర్ ను బదిలీ చేశారని, రైతులపై కాల్పుల ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. రైతులతో ఫొటోలు దిగేందుకే రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన పెట్టుకున్నారని ఈ సందర్భంగా విమర్శించారు.

More Telugu News